viral video: PTI మహిళా జర్నలిస్ట్‌పై ANI రిపోర్టర్ దాడి

viral video: PTI మహిళా జర్నలిస్ట్‌పై ANI రిపోర్టర్ దాడి

లోక్‌స‌భ ఎన్నికలలో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బ‌హిరంగ‌ సభలో PTI ( ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)లో పని చేస్తున్న మహళా జర్నలిస్ట్ పై ANI వార్తా సంస్థ రిపోర్ట్ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రెస్ మీట్ లో విజువల్స్ సేకరించే టైంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా... రిపోర్టర్ ఆమె చెంపపై కొట్టాడు. దీంతో వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు అతన్ని ఆపారు. ఈ ఘటనపై పీటిఐతో పాటు పలు వార్తా సంఘాలు, జర్నలిస్టులు ఏఎన్ఐకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ANI రిపోర్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ట్లు పీటీఐ తెలిపింది.